కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
ఢిల్లీ: పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరిన ముఖ్యమంత్రి
కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని సీఎం విజ్ఞప్తి
పూర్వోదయతో గ్రోత్ ఇంజన్ గా ఏపీ
దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే పూర్వోదయ పథకం వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకునేందుకు, జాతీయ ఆర్ధిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలుస్తుందని పేర్కొన్న సిఎం చంద్రబాబు
గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ, సాగునీటి పారుదల వ్యవస్థల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల నిర్మాణం, విద్య వైద్య రంగాల సదుపాయాల కల్పన కోసం పూర్వోదయ పథకం కీలకంగా మారుతుందని పేర్కొన్న సీఎం
తద్వారా ఆయా గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన ఆర్దిక అవకాశాలను అందిస్తుందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
విద్య, నైపుణ్యాకల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల లాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరిన సీఎం
ఈ పథకం కింద ప్రాధాన్యతా క్రమంలో చేపట్టే ప్రాజెక్టులకు పాలనాపరమైన నిబంధనల్ని సరళీకృతం చేయాలని ..రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని వినియోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సాస్కీతో ఏపీకి చేయూత
సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన సీఎం
విశాఖలో యూనిటీమాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులివ్వాలని కోరిన సీఎం
సాస్కీకింద రెండో విడత నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు
తీవ్ర ఆర్ధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి సాస్కీ పథకం కింద నిధులు కీలమని పేర్కొన్న సీఎం
వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టలు, రాష్ట్ర, జిల్లా రహదారుల నిర్మాణం, ఎంఎస్ఎంఈ పార్కులు, హౌసింగ్, వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరిన సీఎం
2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఈ పనులకు గానూ రూ.10,054 కోట్లు సాస్కీ కింద మంజూరు చేయాలని కోరిన ముఖ్యమంత్రి
రాయలసీమ హార్టికల్చర్ హబ్
రాయలసీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఆర్ధిక సాయం కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని కేంద్రమంత్రికి అందచేసిన ముఖ్యమంత్రి
ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న 18 పంటలను సాగు చేస్తోన్నట్టు విజ్ఞాపన పత్రంలో పేర్కొన్న సీఎం
ఈ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాల్లో విస్తరించిన 93 ఉద్యానవన క్లస్టర్లు ప్రత్యక్షంగా పరోక్షంగా 33.7 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తాయని స్పష్టం
ఎగుమతులు చేసేందుకు వీలుగా ఉద్యాన ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పండుతున్నాయని తెలిపిన ముఖ్యమంత్రి
ప్రస్తుతం ఉన్న 8.48 లక్షల హెక్టార్ల హార్టికల్చర్ సాగును 2029 నాటికి 12.28 లక్షల హెక్టార్లకు విస్తరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్న సీఎం.
ఈ ప్రాంతంలో నీటి వనరులను మెరుగుపర్చటంతో పాటు ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతికి వీలుగా రోడ్డు, రైలు, ఓడరేవులు, ఎయిర్ కార్గో సహా లాజిస్టిక్స్ పార్కుల లాంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని స్పష్టం
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు వచ్చే మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్ధిక సహకారం అవసరమని పేర్కొన్న ముఖ్యమంత్రి
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 విజన్ లకు అనుగుణంగా రైతుల వార్షికాదాయం రూ.2 లక్షల నుంచి 3.5 లక్షలకు పెరుగుతుందని స్పష్టం
ఈ సానుకూల అంశాలను దృష్టిలో ఉంచుకుని 2026-27 కేంద్ర బడ్జెట్ లో రాయలసీమ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీని ప్రకటించాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు
పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు
ఏపీలో సాగునీటి ప్రాజక్టులకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి
రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించుకునేలా పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని కోరిన సీఎం
ఈ మేరకు కేంద్రమంత్రికి విజ్ఞాపన పత్రం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
గోదావరి నదికి వచ్చే వరద జలాల్లో 200 టీఎంసీల నీటిని పోలవరం ఆనకట్ట నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించటమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్న ముఖ్యమంత్రి
ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో కరవు నివారణ సాధ్యపడుతుందని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
మూడు దశలుగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అయ్యే వ్యయాన్ని వివరిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రికి లేఖ అందించిన ముఖ్యమంత్రి
ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఇప్పటికే జలహారతి కార్పొరేషన్ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన ముఖ్యమంత్రి
దీనికి సబంధించి ప్రాథమిక ప్రాజెక్టు రిపోర్టును కూడా కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించినట్టు తెలిపిన సీఎం
దీనికి ఆమోదం తెలిపిన వెంటనే డీపీఆర్ను సమర్పిస్తామని వెల్లడించిన సీఎం.
ఆమరావతి రాజధాని నిర్మాణానికి రుణ సహకారం అందించిన తరహాలోనే ఈ ప్రాజెక్టుకు కూడా కేంద్రం చేయూత అందించాలని కోరిన ముఖ్యమంత్రి
ఈ ప్రాజెక్టు ద్వారా కరవు పీడిత ప్రాంతాలైన ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందుతుందని పేర్కొన్న సీఎం
2026-27 కేంద్ర బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ కేంద్ర ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
