ఎన్నారైలకు తిరుమల తిరుపతి దేవస్థానం… గుడ్ న్యూస్
*ఏపీ నుంచి విదేశాలకు వెళ్లి నివాసం ఉంటున్న ఎన్నారైలకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్
చెప్పింది. స్వరాష్ట్రానికి వచ్చినప్పుడు తిరుమల వెంకన్న దర్శనం చేసుకునే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.* గతంలో ఏపీ ఎన్నార్టీ సొసైటీ చేసిన వినతిని సీఎం చంద్రబాబు ఆమోదించడంతో టీటీడీ ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొస్తోంది. దీంతో ఇకపై ఎన్నారైలకు స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనం సునాయాసంగా లభించబోతోంది. *ఎన్నారైలకు ఇకపై ప్రతి రోజు 100 సేవా బ్రేక్ దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయి.* విదేశాల్లో నివసించే ప్రవాసాంద్రులు టీటీడీ సహకారంతో ఏపీఎన్నార్టీఎస్ అధికారిక వెబ్ సైట్ https://www.apnrtcs.ap.gov.in లోకి లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి వివరాల పరిశీలన తర్వాత టికెట్లు మంజూరు చేస్తారు. వీఐపీ బ్రేక్ పాసుల విషయంలో మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 0863 2340678ను కూడా అందుబాటులో ఉంచారు.
