ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్….ఇకపై ఇంటి దగ్గరకే.. ఉచితంగా హోమ్ డెలివరీ
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ తమ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తోంది.
మూడేళ్లుగా ఇంటి వద్దకే కొరియర్లు, పార్సిల్లు అందించే డోర్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నా, చాలా మందికి దీనిపై అవగాహన లేదు.
ఈ సేవలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు, డిసెంబరు 20 నుంచి ఒక నెల రోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఈ మాసోత్సవాల ద్వారా ప్రజలకు డోర్ డెలివరీ సేవలు ఎలా ఉపయోగపడతాయో, ఎలా బుక్ చేసుకోవాలో వివరించనున్నారు.
