రంజాన్ మాసంలో.. ముస్లిం ఉద్యోగులకు గంట ముందస్తు అనుమతి

0

రంజాన్ రోజుల్లో ప్రార్థనల కోసం వెసులుబాటు

ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వ తేదీ వరకు అనుమతి

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఫరూక్

అమరావతి: రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు

పాఠశాలలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం పనివేళల ముగింపు కంటే ఒక గంట సమయం ముందుగానే ప్రార్థనల నిమిత్తం బయటకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ముస్లిం ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల విభాగ అధిపతులకు, జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులలో తప్ప, రంజాన్ మాసంలో ఒక గంట ముందుగా ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు మతపరమైన ఆచారాలు నిర్వహించుకోవడానికి బయటకు వెళ్లేందుకు అనుమతించే నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *