సుప్రీంకోర్టులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు
దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కెసిరెడ్డి రాజ్రెడ్డికి చుక్కెదురైంది. ఇప్పటికిప్పుడు కేసులో జోక్యం చేసుకోలేమని సీజేఐ స్పష్టం చేశారు. కేసులో కేంద్రబిందువుగా ఉన్నారని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. మొత్తం వ్యవహారానికి ప్రధాన కుట్రదారుగా ఉన్నారని తెలిపింది. రూ.700 కోట్ల కుంభకోణంలో 9నెలలు జైలులో ఉండటం ఎక్కువేమీ కాదని వ్యాఖ్యానించింది. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కెసిరెడ్డి తరఫు న్యాయవాది కోరారు. విచారణను
గురువారానికి సీజేఐ ధర్మాసనం వాయిదా వేసింది.
