19న పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక
19న పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక


పుట్టపర్తి సత్యసాయిబాబా శతజయంతోత్సవాలకు ముస్తాబైంది. బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిర్లింగాల దివ్య దర్శనాన్ని ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న పుట్టపర్తికి ప్రధాని మోదీ రానున్నారని, 22న జరిగే స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.
