5 రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల
5 రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల
న్యూ ఢిల్లీ :జమ్మూకశ్మీర్, పంజాబ్లో ఖాళీగా ఉన్న 5 రాజ్యసభ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్ లో 4, పంజాబ్లో ఒక సీటు (ఉపఎన్నిక) ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 6న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16న ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరగనుంది. అదే రోజు
సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్లు లెక్కింపు ప్రారంభం అవుతుంది.
