పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలి: టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశంలో మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం
నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహణ మెరుగుపడింది
పార్టీ కార్యక్రమాల అమలుతీరును నిరంతరం పర్యవేక్షించాలి
మంగళగిరి: అందరికీ పార్టీనే సుప్రీం అని, పార్టీ ఆదేశాలను ప్రతిఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లను ఆదేశించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆయా నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహణ మెరుగుపడింది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేలా జోనల్ కోఆర్డినేటర్లు చొరవ చూపాలి. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల అమలుతీరును క్షేత్రస్థాయిలో జోనల్ కోఆర్డినేటర్లు పర్యవేక్షించాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పెండింగ్ లో ఉన్న అనుబంధ కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తిచేయాలి. మిగిలిన సంస్థాగత కమిటీల నియామకం కూడా పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జోనల్ కోఆర్డినేటర్ లు మంతెన సత్యనారాయణ రాజు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, సుజయ్ కృష్ణ రంగారావు, దీపక్ రెడ్డి, కోవెలమూడి రవీంద్ర, వేపాడ చిరంజీవి రావు, మందలపు రవి, పెళ్లకూరు శ్రీనివాసులు

రెడ్డి పాల్గొన్నారు.
