రోమన్ క్యాథలిక్ బిషప్స్ తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.





కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, ఏలూరు మిషన్ సెంటర్ల నుండి వచ్చిన బిషప్స్, ఛాన్సలర్లు.
గత ముప్పై ఏళ్లుగా తమ చర్చ్ ల పరిధిలో ఎదుర్కొంటున్న పలు భూ సమస్యల గురించి మంత్రి లోకేష్ కు వివరించిన పలువురు బిషప్స్.
తమ పరిధిలో నడుస్తున్న విద్యా సంస్థల గురించి వివరించి, స్కూళ్ల ను సందర్శించాలని కోరిన బిషప్స్.
సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ కు చెప్పిన బిషప్స్.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, త్వరలోనే రోమన్ క్యాథలిక్ చర్చ్ ల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలను సందర్శిస్తానని చెప్పిన మంత్రి నారా లోకేష్.
